ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి 17న ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనుంది. నులిపురుగుల నిర్మూలన దినోత్సవంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలలోని ఒకటి నుంచి 19 ఏళ్లలోపు వారికి ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా అందించనుంది. పాఠశాలలు, కళాశాలలతో పాటుగ అంగన్వాడీ కేంద్రాలలోనూ వీటిని అందించనున్నారు. ప్రభుత్వం నులిపురుగుల నివారణ కోసం ఏటా రెండుసార్లు వీటిని అందిస్తున్న సంగతి తెలిసిందే.