ఏపీలోని విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఐదు ఐఐటీలలో సీట్ల సంఖ్యను పెంచాలని, మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాలని నిర్ణయించారు. తిరుపతి ఐఐటీ సహా ఐదు ఐఐటీలలో విద్యా, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచాలనే ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.