Fire Breaks Out In Andhra Pradesh Secretariat: అమరావతిలో ఉన్న ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సచివాలయంలోని రెండో బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ పేషీలు ఉన్నాయి.