AP Village Ward Sachivalayam Employees Rule: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఉద్యోగులను సొంత వార్డుల్లో కాకుండా ఇతర వార్డులకు బదిలీ చేయాలని ఆదేశించింది. విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయగా, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. APIIATP కింద పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్ల పర్యవేక్షణకు సాంకేతిక కమిటీని పునరుద్ధరించింది.