ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. ఇకపై మూడు.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

3 months ago 11
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెల్లడించారు. మూడు ప్రాంతాల అభివృద్ధికి జోన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక రాజధాని రైతుల సమస్యలు వేగంగా పరిష్కారం కావాలంటే వారంతా ఒక జాయింట్ కమిటీగా ఏర్పడితే బాగుంటుందని సూచించారు. అప్పుడు వారితో చర్చించి సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
Read Entire Article