ఏపీ పారిశ్రామికాభివృద్ధికి ఉన్న ప్రధాన అడ్డంకిని తొలగిస్తూ.. 66,157 ఎకరాల ఏపీఐఐసీ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుండి తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 51,603 ఎకరాలను నేరుగా ఏపీఐఐసీ పేరుతో మ్యుటేషన్ చేసేందుకు అనుమతించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి, ప్రాజెక్టుల వేగవంతమైన నిర్మాణానికి దోహదపడుతుంది.