ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రకృతికి ఎలాంటి హాని చేయకూడదని భావించిన చంద్రబాబు సర్కార్.. చెట్లను తొలగించి.. వాటిని మళ్లీ ఇతర ప్రాంతాల్లో నాటుతోంది. దీనివల్ల ప్రకృతికి ఎలాంటి నష్టం జరగదని భావిస్తోంది. అమరావతిని హరిత నగరంగా మార్చడంలో భాగంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.