ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పారు. డీఎస్సీ నియామకాలను ఆగస్ట్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. విజయవాడలో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం మాట్లాడిన చంద్రబాబు.. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆగస్ట్ నెలాఖరు నాటికి డీఎస్సీ నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు.