Chandrababu Resign Social Media Post: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేస్తారంటూ, ఆయన కుమారుడు లోకేష్ టీడీపీ ఎంపీలతో ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానం పెడతారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీడీపీ స్పష్టం చేసింది. ఉత్తరాది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని, ఇది కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని పార్టీ పేర్కొంది. ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తున్న సమయంలో ఇలాంటి ప్రచారం చేయడం కలకలం రేపింది.