AP Sachivalayam Fire Accident: ఏపీ సెక్రటేరియట్లో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయంలోని రెండో బ్లాక్లో మంటలు చెలరేగాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రుల పేషీలు ఈ రెండో బ్లాక్లో ఉన్నాయి. యూపీఎస్ బ్యాటరీ రూమ్ వద్ద శుక్రవారం ఉదయం ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలిసింది. సచివాలయంలో భద్రతా ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం.