AP Assembly Allow Students: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల్లో చట్టసభల పట్ల అవగాహన పెంచే దిశగా.. వారిని అసెంబ్లీ సమావేశాలు వీక్షించే అవకాశం కల్పించారు. శాసనసభ సందర్శకుల గ్యాలరీ నుంచి విద్యార్థులు సభా కార్యకలాపాలను వీక్షించేందుకు అనుమతించాలని నిర్ణయించారు. ఆసక్తి విద్యార్థుల జాబితాలతో హెడ్మాస్టర్లు స్టాంప్ సంతకాలతో లిస్ట్ పంపించాలని సూచించారు. ప్రతి రోజూ 30మంది చొప్పున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వీక్షించేందుకు అనుమతిస్తారు.