తెలుగు గంగ ప్రాజెక్ట్ కోసం 40 ఏళ్ల క్రితం భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఏపీ హైకోర్టు తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల నమ్మకం కోల్పోతారని, నిర్వాసితులకు న్యాయం చేయాల్సిందేనని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును ప్రభుత్వం సవాల్ చేసినా, డివిజన్ బెంచ్ కొట్టివేసింది.