AP High Court Rs 1 Lakh Fine To Petitioners: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీరియస్ అయింది. కోర్టులో పిల్ వేసి ఉపసంహరించుకునేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని బీచ్ శాండ్ తవ్వకాల టెండర్ల పిటిషన్లను ఉపసంహరించుకునేందుకు కోర్టు నిరాకరించింది. గుంటూరు జిల్లాలో కృష్ణానది ఒడ్డున నిర్మించిన కట్టడాల కూల్చివేత పిల్ను ఉపసంహరించుకునేందుకు ప్రయత్నించిన పిటిషనర్కు లక్ష రూపాయల జరిమానా విధించింది. డీ-అడిక్షన్ సెంటర్లపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వానికి సూచించింది.