Konakalla Narayana RTC Privatization Rumours: ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న ప్రచారంపై ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని కొనకళ్ల తెలిపారు.. తాను విద్యుత్ బస్సుల అంశాన్ని గురించి ప్రస్తావిస్తే కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. విద్యుత్ బస్సుల్ని కేంద్రం ఇస్తోందని.. వాటి నిర్వహణ బాధ్యతల్ని ప్రైవేట్ సంస్థలకు వారే అప్పగిస్తున్నారన్నారు. అలాగే ఆర్టీసీ ఛార్జీల పెంపు అంశంపై కూడా క్లారిటీ ఇచ్చారు.