ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ సూపర్ న్యూస్ చెప్పింది. ప్రయాగ్ రాజ్ వెళ్లాలనుకునేవారి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఇది కేవలం రాజమండ్రి పరిసర వాసులకు మాత్రమే అందుబాటులో ఉంది. మహాకుంభమేళాకు వెళ్లాలనుకునేవారి కోసం రాజమండ్రి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు 13 పుణ్యక్షేత్రాల మీదుగా ఈ ప్యాకేజీ నడుస్తుంది. అలాగే మహాశివరాత్రి రోజున కాశీవిశ్వేశ్వరుడి దర్శనం కూడా చేసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.