BPCL Refinery In Andhra Pradesh Rs 96000 Crores Mou: ఆంధ్రప్రదేశ్కు భారీ పరిశ్రమ రానుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలో బీపీసీఎల్, ఆయిల్ ఇండియా కలిసి రూ.లక్ష కోట్ల పెట్టుబడితో చమురుశుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను నిర్మించనున్నాయి. 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రాజెక్టు, దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా భారీ ఎథిలిన్ క్రాకర్ యూనిట్ను కలిగి ఉంటుంది. ఇది దేశ ఇంధన భద్రతకు దోహదపడుతుంది.