Andhra Pradesh Get 750 New Electric Buses Under PM E BUS: ఏపీకి కేంద్రం తీపికబురు చెప్పింది. త్వరలోనే రాష్ట్రానికి 750 కొత్త బస్సులు రాబోతున్నట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. పీఎం ఈ-బస్ సేవ ద్వారా ఈ బస్సులు కేంద్రం ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మహిళలతోపాటుగా దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించామన్నారు.