టీడీపీ పార్టీకి కాపు కాయడానికి జనసేనను పెట్టలేదని.. పవన్ను సీఎంగా చూసేందుకు ఏర్పాటు చేశామంటూ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్లారిటీ ఇచ్చారు. తన మాటలను ఎడిట్ చేసి వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కూటమిలో చిచ్చుపెట్టాలనే ప్రయత్నాలు ఫలించవని అన్నారు.