తెలంగాణలో అర్హులైన గీత, చేనేత కార్మికులందరికీ సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గౌడలకు 50 వేల కాటమయ్య కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల పరిహారం ఇస్తున్నామని అన్నారు. ట్యాంక్బండ్పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం.. ఆయన పోరాట స్ఫూర్తి బహుజనులకు ఆదర్శమన్నారు. పిల్లలను చదివించాలని, విద్యకోసం ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయిస్తుందని పేర్కొన్నారు.