AP Rs 961 Crore MGNREGA Funds Release: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త తెలిపింది. ఉపాధి హామీ పథకం కింద కూలీలకు వేతన బకాయిల కింద రూ.961.46 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను సోమ, మంగళవారాల్లో కూలీల ఖాతాల్లో జమ చేయనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలో మెటీరియల్ నిధులు కూడా విడుదల కానున్నాయని అధికారులు తెలిపారు.