విజయవాడలో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. మహానాడు జంక్షన్ - నిడమానూరు మధ్యన 7 కిలోమీటర్ల మేరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని గతంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు NHAI ఆమోదం కూడా లభించింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టును జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ పక్కనపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.