Centre approves semiconductor manufacturing unit in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం తీపికబురు వినిపించింది. రాష్ట్రంలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ నెలకొల్పాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీతో పాటుగా ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలలో సెమీకండక్టర్ తయారీ యూనిట్లు నెలకొల్పనున్నారు. రూ.4600 కోట్ల వ్యయంతో ఈ మూడు రాష్ట్రాలలో నాలుగు సెమీకండక్టర్ యూనిట్లు నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.