ఏపీకి కేంద్రం శుభవార్త వినిపించింది. మంగళగిరిలో ఆర్వోబీ నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళగిరి, కృష్ణా కెనాల్ స్టేషన్ల మధ్య రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది. 112 కోట్ల రూపాయల వ్యయంతో ఆరు వరుసలుగా ఈ ఆర్వోబీ నిర్మాణం చేపట్టనున్నారు. అమరావతిని, 16వ నంబర్ జాతీయ రహదారితో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి అనుసంధానించనుంది.