ఏపీకి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం కిందకు మరిన్ని పాఠశాలలు చేర్చుతామని తెలిపింది. లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఏపీలో పీఎంశ్రీ పథకం కింద 953 పాఠశాలలు ఉన్నాయని.. మరిన్ని పాఠశాలలు చేర్చుతామని తెలిపారు. ఈ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలలో విద్యార్థులకు స్వయం ఉపాధి కోర్సులపై ట్రైనింగ్ ఇస్తారు.