TCS To Launch Visakhapatnam Operations October: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి నారా లోకేశ్ ముంబైలో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. టాటా గ్రూప్తో కలిసి ఈవీ ఛార్జింగ్, సోలార్ ప్రాజెక్టులు, విశాఖలో ఇంజినీరింగ్ సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. రహేజా గ్రూప్తో మైండ్స్పేస్ బిజినెస్ పార్క్, డేటా సెంటర్ హబ్, హోటల్స్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. హెచ్పీ సంస్థను పీసీల తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆహ్వానించారు.