Nara Lokesh Tweet On Karnataka: ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల రాకతో కొత్త జోష్ కనిపిస్తోంది. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఎంట్రీతో రూపురేఖలు మారబోతున్నాయి. అయితే ఐటీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. పొరుగు రాష్ట్రాలకు సెగ తగులుతోంది అంటూ లోకేష్ సెటైర్లు పేల్చారు. విశాఖను డేటా సెంటర్ల హబ్గా మార్చే ప్రణాళికలు, లక్షల్లో ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించామన్నారు లోకేష్. అలాగే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.