ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి 3 రోజుల పాటు లండన్లో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు లండన్ పర్యటన సాగనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వచ్చే నెల విశాఖలో జరగనున్న సదస్సుకు హాజరు కావాలని లండన్లోని బిజినెస్మెన్లను సీఎం చంద్రబాబు కోరనున్నారు. ఇక లండన్ కంటే ముందు దుబాయ్, యూఏఈ, అబుదాబిల్లోనూ చంద్రబాబు పర్యటన సాగనుంది.