ఆంధ్రప్రదేశ్లో మరో ఐటీ కంపెనీ కొలువు దీరింది. అమెరికాకు చెందిన బాన్బ్లాక్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ఏపీలో తన కార్యాలయం ప్రారంభించింది. గన్నవరంలోని ఐటీ టవర్స్లో ఆఫీసును ప్రారంభించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం బాన్బ్లాక్ టెక్నాలజీస్ మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టుగా ఆర్టీసీ బస్సులలో ఈ సంస్థ అభివృద్ధి చేసిన స్పాట్ బస్ ఐవోటీ డివైజ్లను అమర్చనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా త్వరలోనే ఈ కార్యక్రమం జరగనుంది.