Five IT Companies Comes to Visakhapatnam: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో ఐదు ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రభుత్వం వీటికి భూములు కేటాయించింది. ఐదు కంపెనీలు కలిపి రూ.19 వేలకు పైచిలుకు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా సుమారుగా 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు చెప్తున్నారు. ఐదు ఐటీ సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా పెట్టుబడులు పెడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.