Nizampatnam Radar Center: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాపట్ల జిల్లా నిజాంపట్నం తీర ప్రాంత భద్రతను పటిష్ఠం చేస్తోంది. రూ.451 కోట్లతో హార్బర్ విస్తరణతో పాటు, తీర భద్రతకు కోస్ట్గార్డ్ ఆధ్వర్యంలో కొత్త రాడార్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రాడార్ సెంటర్ చాలా ముఖ్యమని చెబుతున్నారు అధికారులు. ఈ సెంటర్ ద్వారా అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచి, మత్స్యకారుల భద్రతను మెరుగుపరుస్తుంది. ఉగ్రవాద చొరబాట్లను అడ్డుకోవడానికి ఈ చర్యలు దోహదపడతాయి అంటున్నారు.