Andhra Pradesh 16th Finance Commission: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 16వ ఆర్థిక సంఘం నిధుల పంపిణీలో వెయిటేజీ పెరిగింది. దీంతో రాష్ట్రానికి రూ.64,362.16 కోట్లు కేంద్ర పన్నుల్లో వాటాగా రానున్నాయి. అలాగే, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవిక మిషన్ (వీబీ జీ రాం జీ) కార్యక్రమానికి రూ.5,742 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు కొబ్బరి రైతులకు కూడా కొత్త పథకం ద్వారా ఊరట లభించింది.