AP Maritime Board Mou With APM Terminals: ఆంధ్రప్రదేశ్లో పోర్టు లాజిస్టిక్స్ రంగం అభివృద్ధికి భారీ పెట్టుబడులు రానున్నాయి. డెన్మార్క్కు చెందిన ఏపీఎం టెర్మినల్ సంస్థ రాష్ట్రంలోని రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధికి రూ.9 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదిరింది. దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి లభించనుంది. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో పోర్టుల ఆధునీకరణ జరగనుంది.