Andhra Pradesh ArcelorMittal Steel Plant Rs 1.47 Lakh Crores: విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు తీసుకురావాలని పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సదస్సులో గూగుల్తో డేటాసెంటర్ ఏర్పాటుకు ఒప్పందం, ఏరోస్పేస్ సిటీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ భారీ స్టీల్ ప్లాంట్ రాబోతోందని, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని మంత్రి లోకేష్ వెల్లడించారు.