Nara Lokesh laid Foundation Stone for Sify Data Center Vizag: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. రూ.1500 కోట్లతో విశాఖలో సిఫీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. రెండు దశల్లో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఆదివారం ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్కు ఆదివారం శంకుస్థాపన జరిగింది. రుషికొండ ఐటీ పార్కులో సిఫీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అలాగే ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు కూడా నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ డేటా సెంటర్ ద్వారా వేయి మందికి ఉపాధి దొరుకుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.