ఏపీకి మరో శుభవార్త చెప్పిన కేంద్రం.. నిధులు విడుదల..

3 months ago 14
ఏపీకి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. నక్ష కార్యక్రమం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. నక్ష కార్యక్రమం అమలులో చూపిన ప్రగతికి గానూ.. రూ.125 కోట్లు కేటాయించినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. మరోవైపు నక్ష కార్యక్రమం కింద పట్టణాలు, నగరాల్లో పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు మంజూరు చేస్తారు. ఏపీలోని పది ప్రాంతాల్లో ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు.
Read Entire Article