Andhra Pradesh Lg Plant Groundbreaking Ceremony On May 8th: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో గృహోపకరణాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది, దీనికి మంత్రి లోకేష్ భూమిపూజ చేస్తారు. ఈ పరిశ్రమ ద్వారా రూ.5,001 కోట్ల పెట్టుబడులు, రెండు వేల ఉద్యోగాలు లభించనున్నాయి. రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.