ఏపీకి వాతావరణ శాఖ చల్లని కబురు.. ఈ ప్రాంతాల్లో వర్షాలు

1 year ago 27
AP Weather Today: భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడుతున్న వేళ, ఏపీ వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు తెలిపింది. రాగల రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అలానే రాగల రెండు రోజుల పాటు ఉండే ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయనే వివరాలు వెల్లడించింది.
Read Entire Article