దావోస్ పర్యటన గురించి వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎంవోయూలు చేసుకుంటే కంపెనీలు రావని.. నెట్ వర్క్ వల్లనే పరిశ్రమలు వస్తాయని చంద్రబాబు చెప్పారు. ఏపీలో బీపీసీఎల్ ప్రాజెక్టు, అనకాపల్లిలో మిట్టల్ కంపెనీ పెట్టుబడులు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇలా ఇప్పటి వరకూ పది లక్షల వరకూ పెట్టుబడులు తెచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. అలాగే ఏపీకి హైదరాబాద్ లేదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైనా చంద్రబాబు స్పందించారు. తాను తెలుగు ప్రజల కోసమే హైదరాబాద్ అభివృద్ధి చేశానని.. దాని గురించి ఎవరు ఎలా చెప్పినా పర్లేదన్నారు.