ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సింగపూర్ సహకారం కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి టాన్ సీ లెంగ్తో సమావేశమయ్యారు. గ్రీన్ ఎనర్జీ, పోర్టులు, ఇతర రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని కోరారు. గతంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్ నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీతో కలిసి పనిచేయడానికి సింగపూర్ మంత్రి ఆసక్తి చూపారు. గృహ నిర్మాణంలో సహకారానికి హామీ ఇచ్చారు. అమరావతి మాస్టర్ ప్లాన్కు సింగపూర్ సహకారం అందిస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు తెలిపారు.