బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఉన్న అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణ అండమాస్ సముద్రానికి సమీపాన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా శుక్రవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. వర్షాల నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు.