Chandrababu On Banakacherla Project: సంక్షేమం, అభివృద్ధి, పాలనలో మార్పులే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ, ప్రజల నమ్మకాన్ని చూరగొంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, విధ్వంసాలను సరిదిద్దుతూ, రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అన్నారు సీఎం చంద్రబాబు.