ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

1 year ago 20
Andhra Pradesh Weather Today: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు రైతులు పంట నష్టపోయారు. అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టారు.
Read Entire Article