Andhra Pradesh 13 Districts Rtgs Centers: మొంథా తుఫాన్ అనుభవం తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రియల్టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సాంకేతికతను మరింత బలోపేతం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ, విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి, ప్రాణనష్టాన్ని నివారించడానికి ఈ వ్యవస్థను కీలకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక సాంకేతికతతో పాలనను మెరుగుపరచడమే దీని ఉద్దేశ్యం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.