Andhra Pradesh Degree Colleges Notice: ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు ఉన్నత విద్యామండలి షాక్ ఇచ్చింది. విద్యార్థులు లేని, తక్కువ అడ్మిషన్లు ఉన్న కళాశాలలకు నోటీసులు జారీ చేసింది. కృష్ణా, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలోని మూడు కాలేజీల్లో అసలు విద్యార్థులే లేరు. 270 కళాశాలల్లో 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు ఉన్నాయి. వివరణ ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించింది. తగిన వివరణ లేకుంటే అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించింది.