రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు చేపడుతున్న ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పోర్టుల వెంబడి పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఆరు పోర్టులకు అనుసంధానిస్తూ 8 చోట్ల పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేసేందుకు ఏపీ మారీటైమ్ బోర్డు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ నగరాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. టెండర్ల ద్వారా కన్సల్టెన్సీలకు మాస్టర్ ప్లాన్ బాధ్యతలు అప్పగిస్తారు.