ఏపీలో కొత్తగా ఆరు వరుసల నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. అమరావతి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయుడుపేట రేణిగుంట జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. ఆరు వరుసలుగా నాయుడుపేట రేణిగుంట జాతీయ రహదారిని నిర్మించారు. మొత్తం 57 కిలోమీటర్ల మేర నాయుడుపేట రేణిగుంట జాతీయ రహదారి నిర్మించారు. ఈ రహదారిపై ఇప్పటికే రాకపోకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రధాని మోదీ అధికారికంగా జాతికి అంకితం చేశారు.