ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ఆర్టీసీ కాంప్లెక్స్ పనులకు నిధులు కేటాయించింది. అరకు లోయకు నిత్యం సందర్శకులు తరలి వస్తుంటారు. అయితే అరకు ఆర్టీసీ కాంప్లెక్సులో సరైన స్థాయిలో మౌలిక సదుపాయాలు లేవు. ఈ నేపథ్యంలో అరకులోయ ఆర్టీసీ కాంప్లెక్స్ మరమ్మత్తుల కోసం రూ.2 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో అధికారులు పనులు మొదలుపెట్టారు.