ఏపీలో అక్కడ ఉచిత బస్సు సౌకర్యం.. అది కూడా వారికే..

1 year ago 38
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. విజయవాడ ఘాట్ రోడ్డు మూతపడనుంది. నవంబర్ 19 సాయంత్రం నుంచి నవంబర్ 22 వరకూ దుర్గ గుడి ఘాట్ రోడ్డు మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కొండ రక్షణ చర్యల్లో భాగంగా దుర్గ గుడి ఘాట్ రోడ్డును మూడు రోజులు మూసివేస్తున్నట్లు దుర్గ గుడి ఈవో రామారావు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. మరోవైపు దుర్గమ్మ భక్తుల కోసం వినాయకగుడి, స్నానాల రేవు నుంచి కనకదుర్గానగర్ వరకూ ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులు కనకదుర్గానగర్ మీదుగా రావాలని సూచించారు.
Read Entire Article