ఆంధ్రప్రదేశ్లో లులు గ్రూప్ పెట్టుబడులకు రావడం సంతోషకరమైన విషయమే అయినా, విజయవాడలో షాపింగ్ మాల్ నిర్మాణం కోసం పాత బస్ డిపో స్థలాన్ని కేటాయించాలనే ప్రతిపాదన వివాదానికి దారితీసింది. వందల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులుగా గొల్లపూడిలో స్థలం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా, ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.