Andhra Pradesh Zero Shadow Today: ఆంధ్రప్రదేశ్లో ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. నేటి నుండి కొన్ని రోజుల పాటు మధ్యాహ్నం వేళ రెండు నిమిషాల పాటు నీడ కనిపించకుండా పోతుంది. సూర్యకాంతి లంబంగా పడటం వల్ల ఈ 'జీరో షాడో' ఏర్పడుతుందని ఇంటర్నేషనల్ ఆస్టరాయిడ్స్ సర్చ్ క్యాంపెయిన్ కన్వీనర్ మేకా సుసత్యరేఖ తెలిపారు. భూమి వంపు కారణంగా సూర్యుడు ఉత్తర, దక్షిణ దిశల్లో కదులుతున్నట్లు అనిపిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలకు ఇది సూర్యుని కదలికను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.